కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం: ఏపీలో సౌకర్యాలపై సీపీఐ నారాయణ

Publish Date:Apr 30, 2022

Advertisement

సీపీఐ పార్టీ సీనియర్ నేత  నారాయణ ఏమి చేసినా.. ఏది మాట్లాడినా ఓ సంచలనం అవుతుంది. ఏపీ అసెంబ్లీలో 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ ను పొగుడుతూనే ఇంకా బానిస బతుకేనా? అంటూ చురకలంటించినా, ప్రధాని మోడీని వరసపెట్టి ఏకేసినా.. ఆర్కే రోజా నియోజవర్గం నగరిలో ఉపాధి కూలీగా మారి, పని చేసినా... ‘అదొక బ్రోతల్ హౌస్’ అని బిగ్ బాస్ షోని పోల్చినా.. సినీ నటి కంగనా రనౌత్ ని ‘కాస్ట్లీ బిచ్చగత్తె’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినా.. వైసీపీ- బీజేసీ సహజీవనం చేస్తున్నాయన్నా నారాయణ రూటే సెపరేట్ గా ఉంటుందనేది నిర్వివాదాంశం. అంతుకే నారాయణ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటాయి.

తాజాగా.. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఏపీలో కరెంట్ లేదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వాన్నం.. అసలు మౌలిక సదుపాయాలే ఉండవు‘ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభ వేదిక నుంచి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో నారాయణ ఆంధ్రా- తమిళనాడు సరిహద్దును పరిశీలించి.. ఇరు రాష్ట్రాల్లోని రోడ్ల పరిస్థితిని పోల్చి మరీ నారాయణ వ్యాఖ్యానించడం విశేషం. ఏపీలో రోడ్లు గుంతలతో నిండిపోయి ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో చక్కగా ఉన్నాయని చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక పక్కన ఫైరైపోతున్న సమయంలో తాను ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ మాట్లాడడం గమనార్హం.

మొన్నా మధ్యన బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. ‘అదొక బ్రోతల్ హౌస్’ అని నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక సోషల్ క్రైమ్ అని, దాని వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదని అన్నారు. భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని, అది ఒక భిక్ష అని సినీనటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ.. ‘కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె’ అంని నిప్పులు చెరగడం అందర్నీ ఆశ్చార్యానికి గురిచేసింది. మోడీ ప్రధాని అయ్యాయే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆమె మాటల్ని తిప్పికొడుతూ.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హతే కంగనకు లేదని,  ఆ వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశ ప్రజలకు కంగన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం.

బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నారాయణ స్పందిస్తూ.. ఏపీలో వైసీపీ- బీజేపీ సహజీవనం చేస్తున్నాయని.. మధ్యలో దూరిన పవన్ కు బీజేపీ రోడ్ మ్యాప్ ఇందుకిస్తుంది? ఇవ్వదని తేల్చి చెప్పేయడం కమలం- ఫ్యాన్ గుర్తుల రహస్య బంధాన్ని బయటపెట్టేయడం ఆసక్తిగా మారింది. గత ఏడాది మే నెలలో నారాయణ ఉపాధి హామీ కూలీగా మారడం విశేషం. చిత్తూరు జిల్లాలోని ఆర్కే రోజా సొంత ఇలాకా నగరి నియోజకవర్గంలోని అయనంబాక చెవురులో రెండు రోజులు ఉపాధి హామీ కూలిపనులు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లెఫ్ట్ పార్టీలు ఉద్యమించి, పార్లమెంట్ లో  సాధించుకున్న పథకం అని ఆయన చెప్పడా గమనార్హం.
ఇటీవలే కమ్యూనిస్తు నేత నారాయణ విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించడం, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకోవడం సంచలనంగా మారింది. సమ సమాజ స్థాపనకు జీవితాన్నే ధారపోసిన నారాయణ ఇలా స్వామీజీ దర్శనం చేసుకోవడం, నారాయణకు స్వామీజీ కాషాయం కండువా కప్పి ఆహ్వానించడం, స్వామీజీకి శిరసు వంచి, చేతులు జోడించి నారాయణ నమస్కారం చేయడం ఆసక్తిగా మారింది.

ఇటీవలే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి విధానాన్ని తప్పుపడుతూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా జరగలేదని, ఎమ్మెల్యేలను సంప్రదించకుండా జిల్లాల్ని విభజించడం జగన్ సొంత వ్యవహారం కాదని కామెంట్ చేయడానికి నారాయణ వెనుకాడలేదు. అసలు జిల్లాల విభజనకు గవర్నర్ ఏ విధంగా అంగీకరించారని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తారా? అని నారాయణ నిలదీయడం గమనించదగ్గ విషయం. గవర్నర్ గా తాను ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అని నారాయన అనడం సంచలనం అయింది. ఏపీలో విద్యుత్ ధరలను పెంచినప్పుడు కూడా ప్రభుత్వ నిర్ణాయినిక వ్యతిరేకంగా నారాయణ స్పందించారు. ప్రధాని మోడీ, జగన్ ప్రజలపై విద్యుత్ ధరలు పెంచి భారం మోపుతున్నారని ఆక్షేపించారు.

జాతీయ రహదారి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే.. ఊరుకోబోమని, భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని అధికారులు బెదిరించడం దుర్మార్గమని అన్నారు. అలా చేస్తే అధికారుల చేతివేళ్లు కట్ చేస్తామని నారాయణ హెచ్చరించడం సంచలనం అయింది. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.